కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు అవసరం లేకపోవడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేతరేణుకాచౌదరి అన్నారు. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యకర్తలు ధైర్యంగా టీఆర్ఎస్తో తలపడ్డారన్నారు.
తనకు మద్దతుగా నిలిచిన 4 లక్షల మంది ఓటర్లకు కృతజ్ఞతలన్నారు. తోటి మహిళగా కవిత ఓటమిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నేతలు మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపడితే కాంగ్రెస్కు పూర్వవైభవం సాధించడం పెద్ద కష్టం కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాతే పార్టీ ఈ పని చేసి ఉండాల్సిందన్నారు. ప్రజల తరపున బాధ్యత వహిస్తూ అభివృద్ధి పనులు పూర్తయ్యేందుకు మనవంతు కృషి చేసినప్పుడే వారికి దగ్గరకాగలమన్నారు. నేతల తీరు మారనంత కాలం పార్టీ పునరుజ్జీవం కష్టమని చెప్పారు.
రెడ్డి, వెలమలకు మూడు బలుపులుంటాయి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే