telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీవల్లే కళ్యాణ్ గారిని కలిశాను… నా జీవితంలో మీరు చాలా స్పెషల్…

pawan

‘బద్రి’ మూవీ 20 ఇయర్స్ పూర్తిచేసుకోవడం మరోసారి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది రేణుదేశాయ్.సరిగ్గా 20 ఏళ్ల క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా ‘బద్రి’ సినిమా రిలీజై సంచలనాలు సృష్టించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కాసేపు వీడియో చాట్ చేసిన రేణుదేశాయ్. పూరి జగన్నాథ్ ఓ బ్రిలియంట్ రైటర్ అంటూ కితాబు ఇచ్చింది రేణు దేశాయ్. ఎలాంటి ఆడిషన్స్ తీసుకోకుండా నన్ను నమ్మి వెన్నెల రూపంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నా. కాకపోతే ఆ సినిమాలో అదే మెయిన్ రోల్ అని చెప్పి దొంగ పని చేశారు. అయితే మీరు బద్రి సినిమాలో ఆ రోల్ రాశారు, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టే కళ్యాణ్ గారిని కలిశాను. ప్రపంచంలోనే ఎంతో విలువైన ఇద్దరు పిల్లలకు తల్లయ్యాను. అవి నా చిన్నారి దేవతలు అఖీరా, ఆద్యా` అని రేణు పేర్కొన్నారు. ఇదంతా మీరు సృష్టించిన ఆ క్యారెక్టర్ వల్లే జరిగింది. అందుకే నా జీవితంలో మీరు చాలా చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పింది రేణుదేశాయ్.

 

Related posts