తెలుగు తెరపై ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పటి సినిమాల్లో తల్లి, అక్క, వదిన, అత్త పాత్రల్లో మెరిసిపోతున్నారు. నదియా, ఖుష్బూ, తులసి, ప్రగతి, శరణ్య ఆ జాబితాలోకి వస్తారు. తాజాగా స్నేహ, సిమ్రాన్ కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు రేణూ దేశాయ్ కూడా సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోంది. టాలీవుడ్ లో రేణూదేశాయ్ రెండు చిత్రాల్లోనే నటించినప్పటికీ పవన్ కళ్యాణ్ భార్యగా ఆమెకు చాలా పాపులారిటీ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ కు చాలా కాలం క్రితమే విడాకులిచ్చేసిన రేణు ప్రస్తుతం రెండవ వివాహానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుందట రేణూ. ఈ క్రమంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారట రేణూ. వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. కథ ప్రకారం ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి అక్క పాత్రలో కనిపించనుంది.
previous post