గత ఐదు సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి మీద నడుస్తున్న కేసు నుంచి ఊరట లభించింది. చిరంజీవి “ప్రజారాజ్యం” పార్టీ పెట్టిన సమయంలోనే ఈ కేసు నమోదైంది. “ప్రజారాజ్యం” పార్టీ తరపున ప్రచారం చేస్తున్నప్పుడు… 2014 ఏప్రిల్ 27న ఎన్నికల కమిషన్ ప్రచారానికి నిర్దేశించిన సమయం దాటిపోయినప్పటికీ, అర్ధరాత్రి చిరంజీవి ప్రచారం చేశారని గుంటూరు అరండల్ పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా బుధవారం ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. చిరంజీవి ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఆయనపై కావాలని తప్పుడు కేసు నమోదు చేశారని చిరు తరపు న్యాయవాది తమ వాదనలు విన్పించారు. వాదనలు విన్న జస్టిస్ రజని కేసును కొట్టివేశారు. దీంతో ఈ కేసు నుంచి చిరంజీవికి ఇన్నాళ్లకు ఊరట లభించింది.
previous post
next post
సమంత చేసే ఆ పని నాగ చైతన్యకు నచ్చడం లేదట…!?