బీపీ పీఎల్సీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త భాగస్వామ్యవ్యపారానికి తెరలేపింది. తద్వారా రానున్న అయిదేళ్లలో 5500 పెట్రోల్ పంప్ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆర్ఐఎల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను భారత్లోని విమానయాన సంస్థలకు విక్రయించాలని ప్రణాళికలు రచించాయి. ఈ మేరకు ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డాడ్లీ ఒప్పంద పత్రాలపై మంగళవారం ముంబైలో సంతకాలు చేశారు. తుది ఒప్పందం 2019, రెగ్యులేటరీ, ఇతన అనుమతులకు నిబంధనలకు లోబడి, లావాదేవీ 2020 మొదటి అర్ధభాగంలో పూర్తవుతుందని భావిస్తున్నామిన ఆర్ఐఎల్ వెల్లడించింది.
ఇప్పటికే ఉన్న రిలయన్స్ బంకుల ఆధారంగా రీటైల్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే రిలయన్స్కు 1,400 పెట్రోల్ పంపులతోపాటు విమానయాన ఇంధన వ్యాపారం కూడా ఉంది. సరికొత్త జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనున్నామనీ, రీటైల్ సర్వీస్ స్టేషన్ నెట్వర్క్ద్వారా వైమానిక ఇంధన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి. కొత్త జాయింట్ వెంచర్ కంపెనీలో ఆర్ఐఎల్ 51శాతం వాటాను, బిపి 49శాతం వాటాను వాటాను కలిగి ఉంటాయి. ఈ ఉమ్మడి సంస్థ ఆధర్యంలో 5,500 ఇంధన రిటైల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ జాయింట్ వెంచర్లో ఆర్ఐఎల్ ఏవియేషన్ ఇంధనాల వ్యాపారం కూడా ఉంటుంది, ఈ జాయింట్ వెంచర్ ద్వారా తన మార్కెట్ వాటాను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది.