telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఇటలీలో ప్రారంభమైన రాధేశ్యామ్…

Radheshyam

డార్లింగ్ ప్రభాస్- పూజా హెగ్డే కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫష్ట్ లుక్‌‌తో పాటు టైటిల్‌‌తో కూడిన పోస్టర్‌ను ఇంతకముందే రిలీజ్ చేసారు. ఈపోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ పోస్టర్ లోనే ప్రభాస్ పూజ హెగ్డే రొమాంటిక్ లుక్ ను చూపించారు. ఆ తర్వాత పూజాహెగ్డే పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ నుంచి పూజా లుక్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరపాల్సి ఉన్నా కరోనా కారణంగా అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు యూనిట్ సభ్యులు మొత్తం విదేశాలకు వెళ్లారు. ఇటలీలో 15 రోజుల షెడ్యూల్ ను జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ రోజు రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటో పోస్ట్ చేస్తూ ప్రకటించాడు. అయితే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ – పూజా హెగ్డేల మధ్య కీలకమైన కీలక సన్నివేశాలను మరియు ఓ పాటను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయనున మరో రెండు సినిమాలను ఇప్పటికే ప్రకటించేశాడు.

Related posts