పెదనాన్న కృష్ణం రాజు అంటే హీరో ప్రభాస్కి అమితమైన ప్రేమ .ఆయన మరణాన్ని ప్రభాస్ తట్టుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు భౌతికాయం వద్ద స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కృష్ణంరాజుకి నివాళులు అర్పించి ప్రభాస్ ని పరామర్శించగా.. పెద్ద దిక్కును కోల్పాయాను అంటూ ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మంత్రి తలసాని.. ప్రభాస్ ని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ప్రభాస్ ని స్ట్రాంగ్ గా ఉండమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కృష్ణం రాజు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం చేర్పించారు. చికిత్స తీసుకుంటున్న ఆయన్ను చూడటానికి ప్రభాస్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. పెదనాన్నను కడసారి చివరి చూపు చూసుకున్నారు.
ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లాడని తెలిసిన ఫ్యాన్స్కు టెన్షన్ మొదలైంది. తొలుత ఆయనకు ఏమైందని ఆందోళన చెందారు. ఆ తర్వాత కృష్ణం రాజుకు బాలేదని తెలిసిన తర్వాత మరో టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
పెళ్లిపై ఇంట్రస్ట్ లేదు… వాళ్ళకోసమే అలా చెప్పా : సాయి ధరమ్ తేజ్