బీజేపీ నేత, సినీ హాస్యనటుడు బాబూమోహన్ .. టీఆర్ఎస్ కేవలం మాటల ప్రభుత్వమే కానీ, చేతల ప్రభుత్వం కాదని విమర్శలు చేశారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లోని మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్నారని, అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు.
సింగూరు నీటి తరలింపునకు అడ్డు జెప్పినందుకే మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. తాను ఎన్టీఆర్ అభిమానినని, అందుకే, ఆయనకు ఇష్టమైన బీజేపీలో చేరానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన అభిప్రాయపడ్డారు.