telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

స్మార్ట్‌ టీవీల సెగ్మెంట్‌లోకి రియల్ మీ ఎంట్రీ… రూ.12,999కే…!!

Realme-tv

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి.. ఎట్టకేలకు స్మార్ట్‌ టీవీల సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మీడియా టెక్‌ చిప్‌సెట్‌, డాల్బీ ఆడియో క్వాడ్‌ స్పీకర్లు వంటి అధునాతన ఫీచర్లతో రూపొందించిన రెండు టీవీలను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. 32 అంగుళాల డిస్‌ప్లే(1366×768 రిజల్యూషన్‌) టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల డిస్‌ప్లే(1920×1080) టీవీ ధర రూ.21,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. రెండు టీవీల్లోనూ కేవలం స్క్రీన్‌ రిజల్యూషన్‌ మాత్రమే తేడా ఉంటుంది. త్వరలోనే 55అంగుళాల టీవీని కూడా లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ 9.0 సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా స్మార్ట్‌టీవీ పనిచేయనుంది. జూన్‌ 2వ తేదీ నుంచి ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి డాట్‌కామ్‌ ద్వారా స్మార్ట్‌ టీవీలను వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. త్వరలోనే రిటైల్‌ స్టోర్లలోనూ టీవీలను కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు.

Related posts