telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

సెల్ఫీ తీసుకుంటుండగా కాలువలో పడి.. తల్లి, కూతురు మృతిసెల్ఫీ తీసుకుంటుండగా కాలువలో పడి.. తల్లి, కూతురు మృతి

New couples attack SR Nagar

సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదావశాత్తు వరద కాలువలో పడి తల్లీ, కూతురు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని మాండ్సార్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్‌ డీ గుప్తా అనే వ్యక్తి మాండ్సార్‌లోని గవర్నమెంట్‌ కాలేజ్‌లో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన తన భార్య బిందు గుప్తా(48), కూతురు శృతి(22) లతో కలిసి బుధవారం ఉదయం ఇంటికి సమీపంలో పోటెత్తిన వరదను చూడడానికి వెళ్లారు. ఈ క్రమంలో కల్వర్టు అంచున సెల్ఫీ తీసుకుంటుండగా తల్లి, కూతురు ఇద్దరూ కాలు జారి కాలువలో పడిపోయారు. చుట్టు పక్కల వారు, పోలీసులు రంగంలోకి దిగి వారిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. 

Related posts