దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పరిగణిస్తున్న ఎస్బీఐ కూడా స్కాం లకు బలికావడం తో ఆర్బీఐ తీవ్రంగా నిరాశ వ్యక్తం చేసింది. దీనితో గట్టివాతే పెట్టింది. బ్యాంకింగ్ మోసాలను పసిగట్టలేక పోవడం, వాటిని నియంత్రించలేక పోవడం, రుణాల వర్గీకరణ వంటి వాటిలో నియంత్రణ లోపాలను అధిగమించలేక పోయినందుకు ఎస్బీఐకి భారీ జరిమానాయే పడింది. ఈ బ్యాంకింగ్ నిబంధనలను ఆర్బీఐ విధించింది. వీటిని అధిగమించలేక పోయినందుకు ఎస్బీఐకి ఆర్బీఐ రూ.7 కోట్ల జరిమానా విధించింది.
ఎస్బీఐపై సెక్షన్ 47ఎ(1)(సి) బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 కింద ఆర్బీఐ ఈ జరిమానాను విధించింది. ముఖ్యంగా కరెంట్ ఖాతాలు తెరవడం, వాటి నిర్వహణ, ఆదాయ వర్గీకరణ నిబంధనలు, ఆదాయం గుర్తింపు తదితర బ్యాంకింగ్ విధులపై ఆర్బీఐ నిఘా ఉంచుతుంది. ఎస్బీఐలో తనిఖీలు చేసిన మీదటే ఈ నిబంధనలేవీ పాటించడం లేదని తెలుసుకుని నోటీసులు పంపామని ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు.