telugu navyamedia
వార్తలు సామాజిక

అంధులు నోట్లు గుర్తించేందుకు..ఆర్బీఐ సరికొత్త యాప్

cell phone

అంధుల కోసం ఆర్బీఐ సరికొత్త యాప్‌ను రూపొందించింది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఈ రోజు మ‌ని(ఎంఏఎన్ఐ) యాప్‌ను ఆవిష్క‌రించారు. మొబైల్ ఏయిడెడ్ నోట్ ఐడెంటిఫైర్ యాప్ ద్వారా.. అంధులు కరెన్సీ నోట్ల‌ను గుర్తించ‌డం సులువు అవుతుంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ మ‌ని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. భారతీయ క‌రెన్సీ నోట్ల‌పై అనేక ఫీచ‌ర్లు ఉంటాయ‌ని తెలిపారు. అంధులు కూడా నోట్ల‌ను గుర్తించే విధంగా యాప్‌ను రూపొందించామ‌ని శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.

Related posts