telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ కథనం ప్రసారం చేసినందుకే.. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది

Ravi Prakash

 టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. ప్రస్తుతం రవిప్రకాశ్ పరారీలో ఉన్నారు. అయితే ఓ వెబ్ సైట్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలను ఆయన వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ ఓ కథనాన్ని ప్రసారం చేశానని ఆయన తెలిపారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని, అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

తనను టార్గెట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ, వ్యాపార అజెండా ఉందని రవిప్రకాశ్ తెలిపారు. వాస్తవానికి ఆ లైవ్ షోను ప్రసారం చేసే సమయంలో కూడా తాను ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదని, కేవలం వ్యవస్థ వైఫల్యం గురించే ప్రశ్నించానని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తామంతా చూసీచూడనట్టు వ్యవహరించాలా? అని రవిప్రకాశ్ ప్రశ్నించారు.

Related posts