telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కరోనా సెకండ్ వేవ్ : ఐపీఎల్ ఆడనంటున్న అశ్విన్

ఇండియాలో కరోనా విలయం మామూలుగా లేదు. ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు అశ్విన్. తన కుటుంబ సభ్యుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రేపటి నుంచి తాను ఐపీఎల్ కు దూరంగా ఉంటానని తెలిపాడు. ఈ మేరకు అశ్విన్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నీ ప్రకటించాడు. “నా కుటుంబ సభ్యులు కరోనాతో పోరాడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో నేను కుటుంబానికి అండగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే ఈ సీజను రేపటి నుంచి విరామం పలుకుతున్నాను. ఒకవేళ పరిస్థితులు మెరుగు అవుతే మళ్ళీఆడేందుకు వస్తా. ధన్యవాదాలు ” అంటూ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. కాగా నిన్న హైదరాబాద్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచులో… ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Related posts