టీ20 ప్రపంచకప్ లలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తనను తాను నిరూపించుకోవాలని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. 2017లో హెడ్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత తదుపరి కోచ్ ను ఎంపిక చేసేటప్పుడు ఇతరులు దరఖాస్తు చేసుకోకపోవడంతో శాస్త్రిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఐదేళ్ల పాటు జట్టుతో రవిశాస్త్రి ఉన్నాడని… మరో రెండేళ్లు కోచ్ గా కొనసాగే అవకాశం వచ్చిందన్నారు. ఇన్నేళ్ల పాటు జట్టుతో ప్రయాణించే అవకాశం మరెవరికీ రాలేదని గంగూలీ అన్నారు.
2007లో బంగ్లాదేశ్ పర్యటనకు గాను రవిశాస్త్రి మేనేజర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014లో భారత జట్టుకు డైరెక్టర్ గా సేవలు అందించారు. రవిశాస్త్రి ముందు 2020, 2021 టీ20 ప్రపంచకప్ లు ఉన్నాయని… జట్టును విజయపథంలో నడిపించేందుకు మార్గాలను ఆయన అన్వేషించాలని గంగూలీ అన్నారు. రవిశాస్త్రి ఇప్పటి వరకు భారత జట్టుకు ఒక ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేదన్నారు.