అలంద మీడియా ఫిర్యాదు మేరకు ఫోర్జరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్లపై రవిప్రకాష్ ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాశ్ను ఆదేశించింది.
గత మాసంలో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. రవిప్రకాశ్ రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని హైకోర్టు రవిప్రకాశ్కు బెయిల్ నిరాకరించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రవి ప్రకాశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం కోర్టు రవి ప్రకాశ్కు సూచించిన సంగతి తెలిసిందే.