telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీ కోసం రత్నవేలు, సుకుమార్ విడిపోయారట…!

Sukumar

మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బన్నీకి 20వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమైంది. అయితే డైరెక్టర్ సుకుమార్‌కు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో ప్రత్యేక అనుబంధం ఉంది. తన తొలి చిత్రం `ఆర్య` నుంచి `రంగస్థలం` వరకు సుకుమార్ తీసిన అన్ని చిత్రాలకు వీరిద్దరూ పనిచేశారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించబోతున్న సినిమాకు మాత్రం రత్నవేలు పనిచేయడం లేదు. తొలిసారి సినిమాటోగ్రాఫర్ కూబాతో సుకుమార్ పనిచేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రత్నవేలు ట్విటర్ ద్వారా స్పందించాడు. “డియర్ సుక్కూ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం కూడా ‘రంగస్థలం’ తరహాలో మరో కల్ట్ క్లాసిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు ఒకరినొకరం మిస్సవుతున్నాం. తర్వాతి సినిమాకి మళ్లీ కలుద్దాం. అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీప్రసాద్, డీవోపీ కూబా, మోనిక రామకృష్ణ.. అందరికీ శుభాకాంక్షలు” అని రత్నవేలు ట్వీట్ చేశారు.

Related posts