యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం.. ‘లవ్ స్టోరీ’.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏయ్ పిల్లా’ అనే తొలి గీతాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. పవన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. అయితే ఇప్పటికే నాగచైతన్య “లవ్స్టోరి” సినిమాను పూర్తి చేశాడు. తదుపరి సినిమాను పరుశురాం దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. 14రీల్స్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో నాగచైతన్య సరసన రష్మిక మందన్నను హీరోయిన్గా తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట. ఇంతకు ముందు పరుశురాం తెరకెక్కించిన గీత గోవిందంలోనూ రష్మికనే హీరోయిన్గా నటించింది. ఆమెనే ఇప్పుడు హీరోయిన్గా తీసుకోవాలని పరుశురాం అనుకుంటున్నాడట.
పాప పోలిక విషయమై సమీరారెడ్డిపై విమర్శలు