telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ సరసన హీరోయిన్ గా రష్మిక

Rashmika-Mandanna-and-Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఆ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా దర్శకుడు సాయి పల్లవికి కథను వినిపించారట. అయితే కథలో తన పాత్రకు ప్రాధాన్యం లేదని సాయి పల్లవి “నో” చెప్పేసిందని సమాచారం. దర్శకుడు రశ్మికకు కథను విన్పించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది తెలుస్తోంది. ఒకవైపు స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంటూనే మరోవైపు నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు చిత్రబృందం. ఇక ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి తన రెమ్యూనరేషన్ పెంచేశారని, దాదాపు 5 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Related posts