టాలీవుడ్లో ఛలో సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ సినిమాతో ఈ అమ్మడుకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత సినిమాల్లో నటించింది. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ప్రస్తుతం అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో నటిస్తుంది. వీటితో పాటు ‘మిషన్ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, అమితాబ్ బచ్చన్తో కలిసి ‘గుడ్బై’ అనే సినిమాలోనూ నటిస్తోంది.
మరోవైపు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలకు సైన్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తున్న రష్మిక తన ఫాలోవర్స్ పెంచుకుంటుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో రష్మిక ఇండియా మొత్తం చక్కర్లు కొడుతుంది. తాజాగా ఎయిర్ పోర్ట్లో కిల్లింగ్ లుక్తో కనిపించింది రష్మిక. రెడ్ కలర్ డ్రైస్లో క్లీవేజ్ షోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.