కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. ‘ఛలో`తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో సక్సెస్ను సొంతం చేసుకుంది. ఈ నెల 21న ‘భీష్మ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ సొగసరికి ఓ అభిమాని షాకిచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓ ఈవెంట్కి వెళ్లిన సందర్భంలో ఆమెతో సెల్ఫీ దిగడానికి వచ్చిన అభిమాని ఆమెను ముద్దు పెట్టుకుని షాకిచ్చాడట. దాంతో రష్మికతో పాటు అక్కడున్న వారందరూ షాకయ్యారు. అయితే సదరు అభిమాని మాత్రం ముద్దు పెట్టుకుని వెంటనే పారిపోయాడట. అక్కడ ఆ వీడియో తీసిన నెటిజన్లు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో రష్మిక ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సైబర్ పోలీసులు సదరు వీడియోను సోషల్ మీడియా నుండి డిలీట్ చేశారు.
previous post