హీరో నాగశైర్య ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా క్రేజ్ను సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. స్టార్ హీరోలకు ఈ అమ్మడు ఇప్పుడు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. తెలుగు, తమిళం, హిందీలో నటిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలో ఈ భామ పుల్ బిజీ బిజీగా ఉంది.
మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో మెరిసిన ఈ భామ. ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువెత్తాయి.ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమాలో రష్మిక ఛాన్స్ దక్కించుకుంది.
ఇక తెలుగులోనే కాదు తమిళ్లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇటీవలే అక్కడ హీరో కార్తీతో కలిసి సుల్తాన్ అనే సినిమా చేసింది. ఈ సినిమా అక్కడ మంచి టాక్ను సొంతం చేసుకుంది. దాంతో తమిళ్లోనూ రష్మికాకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలాగే బాలీవుడ్లోనూ ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న గుడ్ బై అనే సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటూ.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది కాబట్టి ఫాలోవర్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.