telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా దెబ్బకు విజయ్ మరో రెండేళ్ల వరకు సినిమా చేయడు : రష్మిక మందన్న

Vijay-Devarakonda

“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో డేటింగ్‌లో ఉండడం వల్లే రక్షిత్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను రష్మిక బ్రేక్ చేసుకుందని కన్నడ అభిమానులు విమర్శిస్తుంటారు. అయితే తమ మధ్య ఏమీ లేదని ఇప్పటికే వీరిద్దరూ క్లారటీ ఇచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ రష్మికని ఉద్దేశిస్తూ… విజయ్ దేవరకొండ, రష్మికల జంట చాలా బాగుంటుందని, మీరిద్దరూ కలిసి డేటింగ్ చేయొచ్చు కదా.. అంటూ నేరుగా రష్మికని అడిగాడు. ఇది చూసిన రష్మిక అతడికి కూల్ గా బదులిచ్చింది. “సారీ మై లవ్… కూర్చొని డేటింగ్ చేసుకునేంత సమయం ప్రస్తుతం ఇద్దరికీ లేదు. చేసే పనిలోనే ఇద్దరం ఒకరిపై ఒకరం ప్రేమ, గౌరవం పంచుకుంటామని చెప్పింది. ఇప్పటివరకు విజయ్ ని ఎంతగానో చిరాకుపెట్టానని, ఆ దెబ్బకి అతడు మరో రెండేళ్ల వరకు తనతో సినిమా సైన్ చేయడానికి కూడా ఆలోచిస్తాడంటూ సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తోంది. తమిళంలో కార్తితో మరో సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

Related posts