telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మికకే గుండు కొట్టేశారు.. ఫోటోలు వైరల్ !

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. తెలుగుచిత్ర సీమలో హిట్ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకుంది. తనదైన నటనతో అందరిని అలరించి లక్కీ బ్యూటీ బిరుదును సంపాదించింది. అయితే సిద్ధార్థ్‌ మల్హోత్రా నటిస్తున్న మిషన్‌ మజ్ను సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. తెలుగుఓ పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది రష్మిక.  ఇది ఇలా ఉంటే..  రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు గత రెండు రోజులుగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రష్మిక డై హార్ట్ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. తమిళనాడులోని కొన్ని సెలూన్‌ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్న ఇతర కథానాయికల ఫ్యాన్స్ పేజీలకు వార్నింగ్ ఇస్తున్నారు రష్మిక ఫ్యాన్స్. అంతేకాదు, వారి అభిమానించే హీరోయిన్స్ ఫోటోలను కూడా ఎడిట్ చేస్తూ.. మీమ్స్‌ సృష్టిస్తూ షేర్ చేస్తున్నారు. దీంతో రష్మిక గుండు వివాదం సోషల్ మీడియాలో రచ్చ.. రచ్చగా మారింది. 

Related posts