రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రాశీ ఖన్నా ఇటీవల విడుదలైన జై లవకుశ,టచ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోను తన హవా చూపిస్తున్న రాశీ ఖన్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో తమిళ తెరకి పరిచయం అయింది. ఆ తర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్కి జోడీగా అయోగ్య అనే చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ‘సైతాన్ కా బచ్చా’, “సంగ తమీజన్” , కడాసి విడాసై అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో ‘ప్రతిరోజూ పండగే’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఇక క్యూట్గా హాట్ హాట్ ఫొటో షూట్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాశీఖన్నా గురించి తాజాగా ఓ విషయం బయటికొచ్చింది. ఈ విషయం తెలిసిన సినీ జనాలు రాశీఖన్నా పైకి కనిపించేటంత అమాయకురాలు కాదంటున్నారు. ఎందుకంటే సినిమాలో సీన్ల విషయంలో కానీ, డ్యాన్సుల సందర్భంగా స్టెప్పుల విషయంలో కానీ అస్సలు కాంప్రమైజ్ కాదట. హీరోతో సమానంగా కాకపోయినా, తనకూ దాదాపు అన్ని సీన్లు ఉండాలనీ, అలాగే డ్యాన్సులప్పుడు కూడా తనకు రెండు స్టెప్పులు ఎక్కువే ఇవ్వాలని అడుగుతుందట. ఈ విషయాల్లో అవసరమైతే హీరోలతో గొడవ కూడా పడుతుందట. ఈ విషయాన్ని రాశీఖన్నానే స్వయంగా ఒప్పుకుంది కూడా.
previous post
బికినీలో అనుష్క శర్మ… కోహ్లీ రియాక్షన్…!