జమ్మూకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న ఓ బస్సు బోల్తా పడడంతో 11 మంది మృతి చెందారు. పూంఛ్ లోని ఓ కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి చెందిన విద్యార్థులు మినీ బస్సులో ప్రయాణిస్తుండగా పీర్ కిగలీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు ఓ లోయలో పడిపోయింది.
మృతుల్లో 9 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను షోపియాన్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై జమ్మూకశ్మీర్ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యేంద్రపాల్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.