telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

మరోసారి రను మొండల్ డీడీఎల్ సాంగ్ కు నెటిజన్లు ఫిదా

Ranu

ఓవర్ నైట్‌ స్టార్ సింగర్‌గా ఎదిగిన రను మండల్ మరో పాట నెట్టింట్లో సందడి చేస్తోంది. బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా, రను పాడిన పాట సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఆషికి మై తేరీ” అంటూ మొదలైన ఈ పాటను కూడా రను అద్భుతంగా పాడింది. రను స్వీట్ వాయిస్‌కు మరోసారి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. మరో పాట ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లే జాయింగే‘ నుంచి రను పాడిన మరో పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. డీడీఎల్ నుంచి తుఝె దేఖాతో ఏ జానమ్ అనే పాటను రను పాడింది. దీంతో రను పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ పాటకు 20వేల లైకులతో ముంచెత్తారు. రను స్వీట్ వాయిస్‌ అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్క పాటతో సూపర్ సెలిబ్రెటీ స్థాయినందుకున్న రనుమండల్ ‌దశ తిరిగిపోయింది. రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేసుకునే మండల్ తన పాటతో అందర్నీ ఆకట్టుకునేది. ‘ఏక్ ప్యార్ క నగ్మా హై’ అని రను పాడిన పాటను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడైన హిమేష్ రేష్మియా ఆమె కోసం వెదుక్కునీ మరీ వచ్చాడు. తాను కంపోజ్ చేస్తున్న ‘తేరీ మేరీ కహాని’ సినిమాలో గాయనిగా ఆఫర్ ఇచ్చాడు. ఆమెతో కలిసి డ్యూయట్ కూడా పాడాడు.

Related posts