యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమాను మరికొద్ది రోజులు వెనక్కి జరిగింది. తొలుత ‘సాహో’ను ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30కి వాయిదా వేశారు.
ప్రస్తుతం ఈ సినిమా స్థానాన్ని యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రణరంగం’ చిత్రం ఆక్రమిస్తోంది. నిజానికి ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ‘రణరంగం’ విడుదలను చిత్రబృందం ఆగస్ట్ 15కు వాయిదా వేసింది. ఈ చిత్రంతో పాటు అడవి శేష్ హీరోగా నటిస్తున్న ‘ఎవరు’ సినిమా కూడా విడుదల కాబోతోంది. దీనిని బట్టి చూస్తే సాహో వాయిదా పడిందని అభిమానులు కాస్త నిరాశపడినా కూడా, ఆగస్ట్ మొత్తం సినీ ప్రియులకు పండగలా కనిపిస్తోంది.
కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా… వర్మకు ప్రముఖ నిర్మాత కౌంటర్