యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం “రణరంగం”. సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకుడు. శనివారం ఈ సినిమా పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన పరిణామాల సమాహారమే “రణరంగం”. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 2న చిత్రం విడుదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
previous post
శ్రీదేవి చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు : మాధురీ దీక్షిత్