telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విరాట పర్వం మొదటి పాట అప్పుడే…

రానా దగ్గుపాటి ఎప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. తాజాగా అతడు చేస్తున్న సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌లో నటిస్తున్నారు. అయితే రానా, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్30కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగా ఈ సినిమా పాటలను కూడా వరుసగా విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్ బాబు అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ‘కోలు  కోలు’ అంటూ సాగనున్న పాటను ఈనెల 25న విడుదల చేయనున్నారంట. అంతేకాకుండా ఈ పాటలో హీరోయిన్ సాయి పల్లవి డాన్స్‌ చేయనుందని టాక్ ఉంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సాయి పల్లవి డాన్స్ చేస్తూనే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ పాట ఎలా ఉంటుంది అనేది.

Related posts