telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానులకు చేదు వార్త చెప్పిన రానా

Rana

టాలీవుడ్ లో కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ వైవిద్యభరితమైన పాత్రలు పోషిస్తున్న రానా… తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే ఈ కొత్త పెళ్లి కొడుకు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీని ఓకే చేశారని తెలుస్తోంది. సీనియర్ దర్శకులు మణిరత్నం శిష్యుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుందని, జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. గతంలో ‘గృహం’ లాంటి హారర్ సినిమాతో భయపెట్టిన మిలింద్ రావ్.. ఇటీవలే రానాకు తన వద్ద ఉన్న మరో హారర్ కథ వినిపించారట. చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో ఉన్న ఈ స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రానా. అయితే.. ఈ భల్లాలదేవుడు తాజాగా అభిమానులకు ఓ చేదు వార్త చెప్పాడు. సమంత హోస్ట్‌గా వ్యవహరించే “సామ్‌జామ్‌” కార్యక్రమంలో పాల్గొన్న రానా తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” జీవితం వేగంగా ముందుకెళ్తున్న సమయంలో ఒక చిన్న పాజ్‌ బటన్‌ వచ్చింది… పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉంది. గుండెకు సమస్య తలెత్తుతుంది. నా కిడ్నీలు పాడవుతాయని డాక్టర్లు చెప్పారు. మెదడులో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉంటుందని డాక్టర్లు అన్నారు” అని చెబుతూ రానా కన్నీరు పెట్టుకున్నాడు. రానా చెప్పిన మాటలకు హోస్ట్‌ హీరోయిన్‌ సమంత కూడా కంటతడి పెట్టుకుంది. కాగా.. రానా ప్రస్తుతం అరణ్య సినిమా చేస్తున్నాడు. 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts