దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 70 ఏళ్ల వృద్దురాలు తిరిగి యవ్వనంలోకి వస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్న నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచనాలను అందుకుంటూ ఘన విజయంగా నిలిచింది. ఇటీవలి కాలంలో సౌత్ హిట్ చిత్రాలన్నీ బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగులో మంచి విజయం సాధించిన “ఓ బేబి” చిత్రం కూడా హిందీలో రీమేక్ కానుందని అంటున్నారు. ఈ చిత్రంలో రానా ప్రధాన పాత్ర పోషించనుండగా, సమంత పాత్రలో కంగనా లేదా అలియా నటిస్తారని టాక్. బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కసరత్తులు చేస్తున్నారట. ఈ చిత్రం హిందీ ప్రేక్షకులని కూడా తప్పక అలరిస్తుందని అంటున్నారు.
previous post