telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొక్కలు నాటి నాకు ట్యాగ్ చేస్తే రీట్విట్ చేస్తా : రానా

Rana

రాజ్యసభ సభ్యులు, జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఉద్యమంలా ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలామంది సినీ, రాజకీయ సెలెబ్రిటీలు సైతం మొక్కలు నాటి ఇందులో భాగమయ్యారు. అయితే ఈ ఏడాది ప్రారంభమైన మూడో విడత “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించిన ప్రభాస్.. దగ్గుబాటి రానాకు మొక్కలు నాటాలంటూ ఛాలెంజ్ విసిరారు. యంగ్ రెబల్ స్టార్ విసిరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించిన రానా దగ్గుబాటి.. ఈ రోజు రామానాయుడు స్టూడియోలో మూడు మొక్కలు నాటారు. అనంతరం రానా మాట్లాడుతూ.. “సమాజానికి మేలు చేసే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డార్లింగ్ ప్రభాస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నా అభిమానులు, మా దగ్గుబాటి కుటుంబ అభిమానులు, ప్రకృతి ప్రేమికులంతా పాల్గొని ముందుకు తీసుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాదు ఈ సంకల్పానికి నావంతు ప్రయత్నంగా ఎవరు మొక్కలు నాటి నాకు ట్యాగ్ చేసినా రీట్విట్ చేస్తా” అని అన్నారు.

Related posts