పృథ్వీరాజ్, బిజు మీనన్ ప్రధానపాత్రలో మలయాళంలో మంచి విజయం సాధించిన ‘అయ్యప్పన్ కుషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ పాత్రలో రానా ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా.. బిజు మీనన్ పాత్ర కోసం మాస్ మహారాజ రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరో ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని తెలుస్తోంది. మరి ఈ రీమేక్ పై మాస్ రాజా అభిప్రాయమేంటో చూడాలి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ దర్శకుడిగా సుధీర్ వర్మ లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకుంటున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ రీమేక్ను నిర్మించబోతున్నట్లు సమాచారం.
previous post
మాది పెద్ద సినిమా కాదు.. గొప్ప సినిమా..