దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సంఘీభావంగా ముందుకొస్తున్నారు. తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు ప్రకచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన వంతు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
కరోనా వ్యాప్తి నివారణ నిమిత్తం పీఎం సహాయ నిధికి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. కొవిడ్-19పై పోరాడేందుకు భారత పౌరులందరూ పీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోవింద్ పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా, కోవింద్ నిర్ణయంపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.