telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

రాందేవ్ బాబా సీరియస్ .. పూర్వీకులను అవమానించిందని .. పిర్యాదు..

ramdev baba complaint on sitaram yechuri

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పోలీసులకు సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిపై, యోగా గురువు రాందేవ్ బాబా ఫిర్యాదు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహాభారతాలను ఏచూరి అవమానించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో రాందేవ్ బాబా మాట్లాడుతూ, ‘మన పూర్వీకులను అవమానించిన ఏచూరిపై ఫిర్యాదు చేశాం. ఇది ముమ్మాటికీ క్షమించదగినది కాదు. కటకటాల వెనక్కి ఆయన వెళ్లాల్సిందే.

ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబాతో పాటు పలువురు సాధువులు కూడా ఉన్నారు. ఏచూరి హిందూ మతం హింసకు అతీతమైనది కాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా హింసేనని అన్నారు.

Related posts