telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇటలీలో హీరోయిన్ రామ్…!

Red

తాజాగా రామ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్లు. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పీటర్ హెయిన్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఇటలీలో హీరోహీరోయిన్లపై పాటలు చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమాకు సంబంధించి నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ మీడియాకు అప్‌డేట్స్ ఇచ్చారు. ‘‘ఇప్పటి వరకు రామ్‌ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్‌ – తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి’’ అని రవికిషోర్ వెల్లడించారు. గోవా, హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో జరిపిన షూటింగ్‌తో టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని.. ప్రస్తుతం ఇటలీలో రెండు పాటల చిత్రీకరణ చేస్తున్నామని చెప్పారు. ‘‘ఈ నెల 12 నుంచి ఇటలీలోని టస్క్, ఫ్లారెన్స్, డోలోమైట్స్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. హీరో రామ్, మాళవిక శర్మలపై రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 20 వరకు చిత్రీకరణ జరుగుతుంది. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు’’ అని రవికిషోర్ చెప్పారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత మరో పాటని చిత్రీకరించనున్నామని, దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అన్నారు. మరోపక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని అన్నారు. గతంలో ప్రకటించినట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Related posts