ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజులకి గాను 25 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టిందని టీం చెబుతుంది. పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తన శిష్యులైన అజయ్ భూపతి (ఆర్ఎక్స్100 డైరెక్టర్), అగస్త్య మంజుల (లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు)తో కలిసి ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు వెళ్లబోతున్నారట. ముసాపేట శ్రీరాములు థియేటర్కు మాస్ గెటప్లో బైక్ మీద వెళ్లి సినిమా చూడబోతున్నట్టు వర్మ ట్విటర్ ద్వారా తెలిపారు.
previous post
ఇక ఆ పాత్ర చేయలేను : చిరంజీవి