తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. రాష్ట్రంలో పార్టీ సారథ్య పగ్గాలను రేవంత్రెడ్డికి అప్పగిస్తు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఒక అడుగు ముందుకు రెండు అడుగుల వెనక్కి అన్నట్టుగా సాగినప్పటికీ ఎట్టకేలకు ఆ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే.. తెలంగాణ పీసీసీగా రేవంత్ రెడ్డిని నియమించడంపై సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో స్పందించారు. ఎప్పుడు రాజకీయ పార్టీలపై ఫోకస్ పెట్టే వర్మ… తాజాగా రేవంత్ రెడ్డిని పోగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. “రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియామకం చేసి.. కాంగ్రెస్ అధిష్టానం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు పులులన్నీ.. రేవంత్ రెడ్డి అనే సింహానికి భయపడతాయి. రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించి… రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు చాలా గొప్ప పని చేశారు” అంటూ ట్వీట్ చేశారు వర్మ. కాగా.. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించడంపై కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
previous post