వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. వివాదాస్పద సినిమాలు తీయడమే కాదు వరుసగా సినిమాలు ప్రకటిస్తుంటారు కూడా. అయిత్ వాటిలో కొన్ని సెట్స్ మీదకు వెళతాయి.. మరికొన్ని ప్రకటించిన దగ్గరే ఆగిపోతాయి. కరెంట్ ఇష్యూలను తీసుకుంటూ ఆయన చేసే ప్రకటనలకు ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే..ఎప్పుడూ వివాదాస్పద, వ్యంగ్య కామెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, అఖిల్పై సంచలన ట్వీట్ చేశారు. ఒక ఈవెంట్లో ఎన్టీఆర్, అఖిల్ కలిసిన సందర్భంలో వాళ్లు సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోను షేర్ చేసిన ఆర్జీవి ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే… అంటూ ఇండైరెక్ట్గా కౌంటర్ వేశారు. ఈ వీడియోలో తారక్ సరదాగా అఖిల్ తొడపై గిల్లడం.. చాలా చనువుగా వీళ్లు ఉండటం మనం గమనించవచ్చు. అయితే.. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన ట్వీట్పై అటు నందమూరి, ఇటు అక్కినేని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రెండు పెగ్గులు పడగానే.. ఏది పడితే అది మాట్లాడుతావు.. నీ గురించి మాకు తెలియదా ” అంటూ ఆర్జీవీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇక అంతకుముందు ట్వీట్లో నారా లోకేష్పై వర్మ సెటైర్ వేశారు. అమ్మాలను వదిలేసి.. సెల్ఫీలపై పడిపోయాడని ఎద్దేవా చేశారు. “అక్కడ తారక్, మరియు అఖిల్అక్కినేనిల ప్రేమకథ అలా ఉంటే… ఇక్కడ నారా లోకేష్ అమ్మాయిలను వదిలేసి.. సెల్పీలపై పడిపోయాడు.. ఇది స్త్రీ జాతి ముగింపా ” అంటూ మరో ట్వీట్ చేశాడు వర్మ.
Am feeling so sad for heroines😢😢😢😫😫😫 pic.twitter.com/cK64qdQi4n
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2021
ప్రస్తుతం అగ్రస్థానంలో టాలీవుడ్… : కంగనా