రామ్ చరణ్-శంకర్ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్, చెర్రీ ఇద్దరూ ఇద్దరే.. శంకర్ తన దర్శకత్వంతో సినిమాకు ఎంత హైప్ తీసుకువస్తాడో, చెర్రీ కూడా అదే స్థాయిలో తన నటనతో సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకు వెళ్తారు. వీరి కాంబోలో సినిమా అనడంతో సినిమా చాలా కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాను 3డీగా చిత్రీకరించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ మేరకు శంకర్ సినిమా నిర్మాతలు దిల్ రాజు, చరణ్లతో సంప్రదింపులు చేస్తున్నారంట. ఈ సినిమా బడ్జెట్ విషయంలో దిల్ రాజు అవధులను పెట్టారంట. ఈ విషయంలో కుదిరినంత త్వరగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చెర్రీ కోసం శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ కథను సిద్దం చేశారని, ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మికను హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post
next post