మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సామాన్యులతోపాటు సినీ ప్రముఖులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల బెంగళూర్లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, తమన్నా, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. చిరుని చూసేందుకు ఫంక్షన్ హాల్కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. హాల్ సరిపోకపోవడంతో కొందరు హాల్ బయటే ఉండాల్చి వచ్చింది. దీనిపై రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. “బెంగళూరులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హాలులోకి ప్రవేశించని అభిమానులకి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ మాకు మరింత ఎనర్జీ ఇస్తుంది. అక్టోబర్ 2న విడుదల కానున్న సైరా నరసింహారెడ్డి చిత్రంతో ఫుల్గా ఎంజాయ్ చేయండి” అని చరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
previous post