దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలై 30, 2020న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైందని ఇటీవల మేకర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా అలియా భట్, ఎన్టీఆర్కి జోడీగా ఓలివియా మోరిస్పై సనటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే విడుదల తేదీపై ఇటీవలి కాలంలో రకరకాల వార్తలు వచ్చాయి. “ఆర్ఆర్ఆర్” షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదని, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల సినిమా అనుకున్న సమయానికి విడుదల కాదని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై చిత్రబృందం ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా రామ్చరణ్ స్పందించాడు. విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరైన చెర్రీ.. “ఆర్ఆర్ఆర్” విడుదల గురించి స్పష్టతనిచ్చాడు. “ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయిపోయింది. అనుకున్న సమయానికే సినిమా ప్రేక్షకుల ముందకు వస్తుంది” అని చెర్రీ స్పష్టం చేశాడు.
previous post
next post