telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అఖిల్, రామ్ చరణ్ లతో … మల్టీ స్టారర్ ఎలా ఉంటుంది…

ram charan and akhil in tour

సెలెబ్రిటీలు ఏ ఇద్దరు ఒక చోట కనబడినా దానిని వార్తగా చేసేయడం పరిపాటే. అయితే ఆ ఇద్దరు యువ నటులైతే, వచ్చే వార్త వేరుగా ఉంటుంది. ఇటీవలే మల్టీ స్టారర్ చిత్రాలకు టాలీవుడ్ నటులు సుముఖత చూపుతున్న నేపథ్యంలో, ఏ ఇద్దరు నటులు ఒక చోట కనపడినా అడిగే ఒకే ప్రశ్న, మీరిద్దరూ మల్టీ స్టారర్ చేయబోతున్నారా..? ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరికి వేశారు అంటే, రామ్ చరణ్-అఖిల్. వీరిద్దరూ అలా కెమెరాకు చిక్కారో లేదో, ఇలా వార్త వచ్చేసింది.

ఇంతకీ వారు ఎక్కడ దొరికారంటే, యువ హీరోలు రామ్ చరణ్, అఖిల్ లు ప్రస్తుతం విహార యాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు. తమ యాత్రలో భాగంగా మంచుపర్వతాలను కూడా వీళ్లు సందర్శించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అఖిల్ తో మరో ఇద్దరు స్కీయింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఓ ఫొటోను చెర్రీ భార్య ఉపాసన ఓ పోస్ట్ చేశారు. అబ్బాయిలు ఎప్పటికీ అబ్బాయిలేనని, అక్కడ ఎలాంటి యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేయరని అనుకుంటున్నానని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, ఆ ట్రిప్ కు ఉపాసన వెళ్లలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు.

Related posts