దర్శకుడు శంకర్ విజువల్ వండర్తో ప్రేక్షకుల ను కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్తో భారతీయుడు 2 సినిమా చేసేందుకు సన్నద్దమవుతున్నాడు. వచ్చే నెల నుండి చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రియా భావన శంకర్, ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం కోసం శంకర్ .. రకుల్తో చర్చలు జరపగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండగా ఇందులో సిద్ధార్ద్, విద్యుత్ జమాల్, ఢిల్లీ గణేష్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది. కాగా, రకుల్ నటించిన తాజా చిత్రం మన్మథుడు 2. ఈ మూవీ ఆగస్ట్ 9న విడుదల కానుంది.