ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ, యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోల సరసన నటిస్తూ చాలా బిజీగా ఉంది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రస్తుతం స్పెయిన్లోని ఇబిజలో సేద తీరుతోంది. అక్కడి బీచ్లో బికినీతో దిగిన ఫోటోలను రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. `పైన నీలాకాశం.. కింద ఇసుక.. మధ్యలో ప్రశాంతత` అంటూ రకుల్ పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆమె వివిధ భాషల్లో నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఇటీవల రకుల్ తెలుగులో నటించిన “మన్మథుడు-2” చిత్రం విడుదలైంది. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన, అలాగే తమిళంలో కమల్, శంకర్ `భారతీయుడు-2`లోనూ నటిస్తోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలు దొరికినప్పుడల్లా రకుల్ వీదేశీ టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటుంది.
View this post on Instagram
Sky above , sand below ,peace within!! ❤️ happiness all around ! #ibizadiaries @flirtatious_india
సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్…!