ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలను బీజేపీ సభ్యులుగా గుర్తిస్తూ రాజ్యసభ వెబ్సైట్లో మార్పులు చేసింది. గురువారమే సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి బీజేపీలో చేరారు. తమను బీజేపీ ఎంపీలు పరిగణించాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి లేఖ అందజేశారు. దీంతో బీజేపీలో టీడీపీ విలీనం అయిపోయింది.
ఈ మేరకు రాజ్యసభ వెబ్సైట్లో కూడా ఆ నలుగురిని బీజేపీ ఎంపీలుగా గుర్తిస్తూ మార్పులు చేశారు. ఇదిలా ఉంటే బీజేపీలో విలీనాన్ని లోక్సభ టీడీపీ ఎంపీలు తప్పుపట్టారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యను టీడీపీ నేతలు ఢిల్లీలో కలుసుకున్నారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని లేఖ సమర్పించారు.