ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్ గ్రామంలో నిర్మించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నూతన కార్యాలయాన్ని శుక్రవారం రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా పోరాడుతుందని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో టెర్రరిస్టులను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయన్నారు.
ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీగా దర్యాప్తు చేసే సంస్థగా ఎన్ఐఏకు గుర్తింపు ఉందన్నారు.ఎన్ఐఏ దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులతో ముడిపడి ఉన్న కేసులను ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతుందని తెలిపారు. దేశంలో మార్పు కోసం అన్ని సంస్థలతో పాటు ఎన్ఐఏ పాత్ర కూడా ఉండాలన్నారు. ఐఎస్ఐఎస్పై విచారణ చేపట్టేందుకు ఎన్ఐఏకి హోంశాఖ పూర్తి స్వేచ్ఛనిచ్చిందని రాజ్నాథ్ వెల్లడించారు.
చంద్రబాబుకు ఓటేస్తే..అన్నీ ప్రైవేట్ పరం: జగన్