telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలి: రాజ్ నాథ్ సింగ్

Rajnath singh Bjp

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గత రాత్రి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్న వైద్యులు, ఇతర పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచామని న్యూఢిల్లీ అండ్ ఆర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించారు.

ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రణబ్ కు కరోనా కూడా సోకడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి, చికిత్స అందిస్తున్నారు. తాను ఆర్మీ ఆసుపత్రిని సందర్శించానని, ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ లో వెల్లడించారు.

Related posts