ధంక్యా గ్రామంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి రాజ్నాథ్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పాక్ కు ఘాటు హెచ్చరికలు చేశారు. 1971లో బంగ్లాదేశ్ విడిపోయిన విషయాన్ని పాక్ గుర్తు పెట్టుకోవాలని, పద్ధతులు మార్చుకోకపోతే పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలోనూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. మళ్లీ తప్పు చేయొద్దని హితవు పలికారు. జైపూర్ సమీపంలోని
బాలాకోట్ దాడుల విషయంలో భారత్ ‘చాలా జాగ్రత్తలు’ తీసుకుందని, ఉగ్ర శిబిరాలు లక్ష్యంగా మాత్రమే దాడులకు పాల్పడినట్లు రాజ్నాథ్ వెల్లడించారు. దాడుల సమయంలో ఇతర ప్రాంతాల్లోగానీ పాక్ సైన్య శిబిరాలపై గానీ బాంబులను ప్రయోగించలేదని గుర్తు చేశారు. పాక్ తన పద్ధతులు మార్చుకోకపోతే ఇలాంటి నిర్ణయాలు మారొచ్చని హెచ్చరించారు.
శాసన మండలిని రద్దు చేయడం జగన్ వల్ల కాదు: యనమల